Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

25, అక్టోబర్ 2016, మంగళవారం

దీపావళి అమావాస్య ప్రాశస్త్యం

"దీపావళి అమావాస్య ప్రాశస్త్యం

దీపావళి అమావాస్యకు వేదాంతంలో ఒక పేరు వుంది. "ప్రేతఅమవాస్య" అని పేరు. కారణం ఆరోజు పితృదేవతలందరూ వస్తారు ప్రదోషవేళకు. వచ్చి ఆకాశమార్గంలో నిలబడతారు. అందుకే ఆరోజు సాయంత్రం ముందు పూజ ఏమిటంటే 'దివిటీ' కొట్టడం. ఆడపిల్లలు కొట్టరు దివిటీ.ఇంటికి పెద్దవాళ్ళు మగపిల్లలు గోగుకర్రమీద జ్యోతులు వేసి దక్షిణదిక్కుగా చూపించాలి."నాన్నగారు ఈరోజు తిధిని జరుపుకుని అలక్ష్మిని పోగొట్టుకుంటాను. భగవదునుగ్రహాన్ని పొందుతాను. మీరు దయచేసి బయలుదేరండి, బాగా చీకటిగా ఉంది, కాబట్టి నేను మీకు వెలుతురు చూపిస్తాను" అని దివిటీ చూపిస్తాడు. జలతర్పణ చేయకుండా దివిటీ ఎత్తి పితృదేవతలకు చూపించే తిధి 'దీపావళి అమావాస్య'. ఆ తరువాత కాళ్ళుచేతులు కడుక్కుని వెళ్లి, ఆచమనం చేసి అప్పుడు లక్ష్మీ పూజ చేస్తారు. బాణసంచా కాల్చడానికికారణం నరకాసురవధ అని లేదు. అలక్ష్మిని తరిమికొట్టి, లక్ష్మిని నిలబెట్టుకోవడానికి చేస్తారు.దీపావళి అమావాస్యనాడు నువ్వులనూనెలో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది.నీటిలోకి గంగ ప్రవేశిస్తుంది.ఆ రోజు ఉదయం నువ్వులనూనె వంటికి రాసుకుని, తెల్లవారుఝామున స్నానం చేస్తారు, దేనికి ఆ నూనె శరీరానికి తగిలితే అలక్ష్మి పరిహారార్ధం. ఇక గంగా స్నానం చేత పాపనాశనం అవుతుంది.

*కార్తీకమాస వైభవం*
( *పుస్తకం నుండి*)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి